THE TESTIMONY OF VEDAS AND WORD OF GOD:


ముస్లింలు వారి మసీద్లో కురాన్ బోధిస్తారు, క్రిస్టియన్స్ వారి చర్చిలో బైబిల్ బోధిస్తారు కాని మన హిందువులకు అతిముఖ్యగ్రంధం అయిన పురాణ వేదాలు మన గుడిలో ఏ పూజారి కుడా ఎందుకని మనకు భొదించరు?? అసలు ఆ వేదాలలో ఏమని ఉంది? ఎవరిగురించిఉంది ??  నేను మీకు  వివరిస్తాను ఒక్క నిమిషము సమయము నాకు ఇవ్వండి ...మన మహాఋషులు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి కనుగొన్న దైవరహస్యాలు మనవేదాలలో ఎన్నో ఏళ్ళు కష్టపడి బద్రపరిచారు.
1)హిందూపురాణ వేదo తెర్తిరియారన్యక  గ్రంధం లో 3 వచనంలో ఇలా రాయబడి ఉంది  (సంస్కృతశ్లోకంలో)  “సర్వపాపపరిహరో రక్తప్రోక్షణం అవశ్యం తద్ద్రక్తం ప్రమాత్మేనా పున్యదానబలియాగః''
అర్ధం :''ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు చేసిన పాపములు క్షమించబడి, నరకం నుండి తప్పించబడి, ప్రతి ఒక్కరికి మరణం తరువాత స్వర్గలోక తలుపులు తెరువబడాలి అంటే, ఒకే ఒక్క మార్గం ఉంది. అది ఏమిటి అంటే దేవుడే ఒక మనిషిలాగా ఈ భూమి ఫైన జన్మించి తనకు తానుగా రక్తంచిందేలా బలి అర్పించబడాలి, అప్పుడే భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క పాపాలన్నీ హరించుకుపోయి మనుషులకు స్వగలోక తలుపులు తెరవబడతాయి''
మన వేదాలలో భ్రుహతారన్యక ఉపనిషత్ అనే గ్రంధంలో ఏమని ఉంది
అంటే ''అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోవచనైవచః'' అంటే కుమారుడు లేనిదే మనకు మరణం తరువాత స్వర్గము లేదు! అని అర్ధం,   కుమారుడు అంటే అందరూ అనుకుంటారు మన కుమారుడు అని!   కానీ పాపము చేసే నీ కుమారుడు పాపము చేసే నిన్ను నరకం నుండి ఎలా రక్షించగలడు?? ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించలేడు కదా ??మరి మనకు స్వర్గలోక దారి చూపించే అతను ఎవరి కుమారుడు ??ఎవరు ఆ దేవుడు?
2) భావిష్యమహపురణ , 3వగ్రంధం, 2వఅధ్యాయం 34వ వచనంలో ఇలా రాసారు (సంస్కృతంలో) “ఈశపుత్రంచ మామ్విది కుమారి గర్భసంభవం'' అర్ధం :మనిషిలాగా పుట్టే ఆ దేవుడు ఒక పెళ్లి కాని ఒక కన్యకు పుట్టాలి !!!!  అయితే మన హిందువుల పురాణాలలో ఒక కన్యకు పుట్టిన దేవుడు ఎవరు ??మరి మన 3 కోట్ల దేవతలలో ఏ దేవుడు ఒక కన్యకు పుట్టి , బలి అర్పించబడతాడు ??అసలు కన్యకు పుట్టిన ఆ దేవుడు ఎవరు ??ఎవరు ??
ఈ లోకానికి మనిషిలాగా ఒచే ఆ దేవుడిని ఎలా గుర్తుపట్టాలి??ఇదే సందేహంతో మన మహా ఋషులు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి కనుగొని మన వేదాలలో రాసి  భద్రపరిచారు. ఆ దేవుడుకి ఉండవలసిన లక్షణములు ఏమిటి అంటే ఇక్కడ క్రింద సంస్కుతశ్లోకంలో ఉన్న సంస్కృత శ్లోకాలను నేను తెలుగులో కి మార్చి రాస్తున్నాను మీకు సులువుగా అర్ధం కావడానికి,
4) అతర్వవేద 13వ అధ్యాయం 3- వచనాలులో ఇలా రాసారు "కౌమరో లోకో అజనిష్ట ’ పుత్రః న్వర్వ్హేతాన్వై ఉత్తరావోత్.
అర్ధం: ఈ భూలోకంలో ఒక కన్యకు కుమారుడు పుడతాడు  అతను ఈ లోకంలో అందరికన్నా గొప్పవాడు శక్తిమంతుడు.”
బైబిల్ లో  మత్తయి  1:23 కుడా ఇలా ఉంది – ఒక కన్యకు కుమారుడు పుడతాడు. అతనే లోక రక్షకుడు అని వ్రాయబడి ఉంది. 
5) రిగ్వేద 355 అధ్యాయం –1వవచనం ) “అతను ఒక పశువుల పాకలో పుడతాడు ''
బైబిల్ లో యేసు క్రీస్తు ఒక పశువుల పాక లో పుట్టాడు అని వ్రాయబడి ఉంది.
6) ఓం శ్రీ వృక్షశుల్ అర్య్తాయ నమః : ఒక చెక్క స్థంభం కు తన చేతులు కాళ్ళు రక్తం కారెల కట్టివేయబడిన దేవ నీకే స్తోత్రం అని వ్రాయబడి ఉంది.
బైబిల్ లో యేసుక్రీస్తుని ఒక చెక్క స్తంభానికి కట్టి వేసారు అని వ్రాయబడి ఉంది.  దానినే సిలువ అంటాము.
7) యజుర్వేద ''ఆ దేవుడు ఆ చెక్కస్థంభం పైన భాధతో వేలాడుతున్నపుడు అతనికి ఒక పుల్లటి రసము నోటికి అందించి తాగనివ్వాలి''
బైబిల్ లో యేసుక్రీస్తు ఆ చెక్క స్తంభానికి వేల్లాడుతూ దాహము తో నీళ్ళు అడిగినప్పుడు , ఒక పుల్లటి రసము ఆయన నోటికి అందిస్తారు అని వ్రాయబడి ఉంది.
8) ఐత్రేయబ్రహ్మనం  లో ఆ చెక్క స్తంభానికి వేలాడుతున్న ఆ దేవుడి ఎముకలు ఒక్కటి కుడా విరగ కూడదు''
బైబిల్ లో యేసు క్రీస్తు ఎముకలలో ఒక్కటి కుడా విరగలేదు అని వ్రాయబడి ఉంది.
9) రిగ్వేద  X : 90:15 భ్రుహదరన్యకొపనిశద్  III : 9 : 28) ''బలి అర్పించబడుతున్న ఆ దేవుడి తల చుట్టు రక్తం కారెల ముళ్ళతో చేసిన కిరీటం పెట్టాలి''
బైబిల్ లో యేసు క్రీస్తు తల చుట్టు రక్తం కారెల ముళ్ళతో చేసిన కిరీటం పెట్టారు అని వ్రాయబడి ఉంది.
10) ఇత్రేయ బ్రహ్మనంలో ఇలా వ్రాయబడిఉంది  ''ఆ దేవుడు చనిపోయాక అతని బట్టలు అక్కడ ఉన్నఅధికారులు పంచుకోవాలి ''
బైబిల్ లో యేసుక్రీస్తు చనిపోయాక అతని బట్టలు అక్కడ ఉన్న సైనికులు పంచుకున్నారు అని వ్రాయబడిఉంది.
3) మన వేదాలలో భ్రుహతారన్యక ఉపనిషత్ అనే గ్రంధం లో ఏమని ఉంది అంటే (సంస్కృతశ్లోకంలో)  “యద్వ్రుక్షోవ్రుక్షనోరోహతి, ములన్నవతరహ్పునః, మర్త్యహ్స్విన్మ్రుత్యునవ్రుక్నః,  కస్మాన్ములాత్ప్రరోహతి  రేతసైతిమావోకాత జివతస్తాత్ప్రాజయతే ధనరుహ్ఏఇవవల్చ్రౌవ్రుక్షొ అన్జసాప్రేత్యసంమ్భవ.
అర్ధం: ఒక చెట్టు ఆకులు రాలి మరల వికసించినట్లు, ఏ దేవుడు అయితే అలా తనకు తానుగా బలి అర్పించబడతాడో అతను మల్లి తరిగి బ్రతకాలి అలా తిరిగిబ్రతికితేనే అతను మనిషిలాగా వచ్చిన దేవుడు.ఇదే అతడు దేవుడు అనడానికి సాక్షం.
మీకు ఇంకా నమ్మకం రాకపోతే వేదాలలో ఉన్న పురాతనమైన మంత్రాలు ఒక్కసారి చదవండి:
1 .ఓం శ్రీ బ్రహ్మపుత్ర్యనమః= దేవుని పుత్రుడా నీకే మహిమా స్తోత్రం
బైబిల్ లో యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని వ్రాయబడి ఉంది.(అంటే దేవుడు పూర్తిగా శక్థి రూపము, కానీ కన్యకు పుట్టిన యేసుక్రీస్తు దేవుడి మనిషి రూపము)
3.ఓం శ్రీ కన్ని సుధయ నమః=ఒక కన్యకు పుట్టిన దేవ నీకే, మహిమా స్తోత్రం.
బైబిల్ లో యేసుక్రీస్తు మేరీ అనే పేరుగల ఒక కన్యకు పుట్టాడు అని వ్రాయబడి ఉంది.
4. ఓం శ్రీ తరిత్ర నారాయణనమః=మాకోసం పేదవాడిగా పుట్టిన దేవ నీకే, మహిమా స్తోత్రం.
బైబిల్ లో యేసు క్రీస్తు ఒక పేదవాడిగా పశువుల పాకలో పుట్టాడు అని వ్రాయబడి ఉంది.
5. ఓం శ్రీ పంచ గాయాయ నమః=శరీరంపైన అయిదు (5) ఘాయాలు కలిగిన దేవ నీకే, మహిమా స్తోత్రం.
బైబిల్ లో యేసుక్రీస్తు కి అయిదు(5) పెద్ద ఘయలు అయ్యాయి, రెండుచేతులు మీద, రెండుకాళ్ళ మీద,ఇంకా ఒకటి తన చాతి పక్కలో మేకులతో ఆయుధాలతో పొడిచారు, మొత్తం అయిదు (5) ఘయలు చేసారు అని వ్రాయబడి ఉంది.
6. ఓం శ్రీ వృక్ష శుల్అర్య్తాయ నమః= త్రిశూలం లాంటి ఒక స్థంభం పైన మా కోసం బలి అర్పించబడిన దైవమా నీకే, మహిమా స్తోత్రం.
బైబిల్ లో యేసుక్రీస్తు సిలువ పైన బలి అయ్యాడు,అని వ్రాయబడి ఉంది. అ సిలువ త్రిశూలంలా ఉంటుంది .
7. ఓం శ్రీ మృత్యం జయ నమః= చనిపొయి తిరిగిలేచి మరణాన్ని జయించిన దైవమా నీకే, మహిమా స్తోత్రం.
కురాన్ – సూరహ్హ్ అనే అధ్యాయం 19:33 వచనం : ‘’నేను పుట్టినరోజు, చనిపోయే రోజు, మళ్ళి తిరిగి లేచె రోజున నాకు సమాధానము కలుగునుగాక’’. అని యేసు ప్రభు అన్నారు
బైబిల్ లో – యేసుక్రీస్తు చనిపొయి మరల 3వ రోజు తిరిగి లేచాడు అని వ్రాయబడి ఉంది.
8. ఓం శ్రీ శిబిలిస్తాయ నమః=నీ శరీరాన్ని భుజించడానికి ఇచ్చిన దైవమా , నీకే మహిమా స్తోత్రం.
బైబిల్ లో యేసుక్రీస్తు ఒక రొట్టెను తుంచి ఇది నా శరీరము ఇది తినువాడు నిత్యజీవము పొందుతాడు అని చెప్పాడు అని వ్రాయబడి ఉంది.
10. ఓం శ్రీ మహా దేవయ్యనమః= దేవుళ్ళకు  దేవుడైన దైవమా నీకే మహిమా స్తోత్రం.
బైబిల్ లో యేసుక్రీస్తు(యెహోవా) దేవుళ్ళకు దేవుడు అని వ్రాయబడి ఉంది.
11. చండోగ్యఉపనిషద్ ఈ మనిషి లో ఏ పాపము ఉండకుడదు అంటే సెక్స్, పెళ్లి, పిల్లలు, భార్యలు లాంటి ఈ లోకానికి సంభందించిన పాపలలో ఏ ఒక్కటి ఇతనిలో ఉండకుడదు.ఇది చాలాముఖ్యమైనది, ఒకమనిషిని, దేవుడిని వేరు చేసే ముఖ్య లక్షణం ఏమిటంటె,,కామం, సెక్స్, భార్య, పిల్లలు, శరీర కోరికలు ,,ఎందుకంటె శరీరం ఉన్నవారికే శరీరకోరికలు, కానీ దేవుడు ఒక శక్తి ,,ఆశక్తికి ఇలాంటి పాపపు ఆలోచనలు కోరికలు ఉండవుఅ ప్పుడే అతను దేవుడు అనడానికి అర్హుడు.
బైబిల్ లో యేసుక్రీస్తులో ఏ పాపములేదు, పెళ్లిచేసుకోలేదు, పిల్లలనుకనలేదు, పాపకార్యం అయిన కామం సెక్స్ తనలోలేదు, ఎవ్వరిని చంపలేదు, అబద్ధం చెప్పలేదు, ఇవన్నీ కాకుండా ఒక పవిత్రమైన కన్యకు పుట్టి అతి పవిత్రముగా ఉన్నాడు అని వ్రాయబడిఉంది.  
ఎవరైతే ఆ మనిషి నామాన్ని (పేరు ని )మసస్ఫూర్తిగా జపిస్తారో ,,ఆ పేరుతో దేవుడిని అడుగుతారో అది కచ్చితం గా  నెరవేరుతుంది అని బైబిల్ లో వ్రాయబడి ఉంది. ఆ పేరులోనే స్వర్గలోక దారి ఉంది అని వ్రాయబడి ఉంది,,,,విమోచనకి ఇది ఒక్కటే మార్గము ఇంకో మార్గము లేదు అని వ్రాయబడి ఉంది.
బైబిల్ లో యేసు క్రీస్తు చెప్పాడు – నేనే మార్గము,నేనే సత్యము,నేనే జీవము, నా ద్వారా తప్ప స్వర్గలోకానికి (తండ్రి (దేవుని) యొద్దకు) వెళ్ళే మార్గము వేరేది లేదు!!!!అని చెప్పాడు.
1) భవిష్యపురాణం, భరత్ఖండ్ అనే అధ్యాయం లో ఆ దేవుడి పేరు కూడా చెప్పారు సంస్కృతశ్లోకం లో,
 ''యీశ్మూర్తి పరపతనిత్యశుద్ధ శివకరీ ఈశమసిహ్యిట్చిమం నామ ప్రతిష్టతం''
అర్ధం :మనలను రక్షించు పరిశుధుడు , విముక్తిని ప్రసాదించు దేవుడు , హృదయంలో కొలువు ఉండే దేవుడు , మన ఆత్మలను రక్షించుదేవుడు ఆయన పేరే  ఈశమసీహ (యేసుక్రీస్తు) (మెస్సయ్యా) (ఏసయ్యా)!!!!!!!!!!!!!!
బైబిల్ లో యెహోవా అనే దేవుడు యేసుక్రీస్తు రూపంలో మనిషిలాగా పుట్టాడు అని వ్రాయబడి ఉంది.
మరి దేవుడిని చూడాలి అంటే ఎలా
2)  (భగవత  గీత  1:7  శ్లోకం) = ''అస్మాకంతు  విసిష్టయే  తన్ని  బోధ  ద్విజొథమ''
అర్ధం : దేవుడిని చూడాలి అంటే ప్రతి మనిషి రెండవ సారి జన్మించాలి. అప్పుడే అతను పరిపూర్ణ బ్రాహ్మణుడు (అంటే దేవుడిని తెలిసిన వాడు)''
రెండవసారి జన్మించడము అంటే బాప్తీస్మం తీసుకోవడం అంటే, నీళ్లలోమునిగి,నువ్వుచేసిన పాపలు ఒప్పుకోవడం. నీటిలో బాప్తీస్మం తేస్కుంటే , దేవుడు మనకోసం చిందించిన రక్తం మనకు వర్తిస్తుంది అప్పుడు మనం మళ్ళి పుట్టినట్లు!! ఎవ్వరైతే అలా బాప్తీస్మం తీస్కుంటారో వాళ్ళే మరణం తరువాత, స్వర్గలోకం లో అడుగు పెట్టి దేవుడిని చూస్తారు , ఇక వారికి(ఆత్మ కి) మరణం ఉండనే ఉండదు అని అర్ధం.
బైబిల్ లో -  ఒకడు రెండవ సారి జన్మిస్తే కాని పరలోక రాజ్యము చూడాలేదు  అని యేసు చెప్పాడు.
ఆకరిగా బైబిల్ లో మరియు ముస్లింల కురాన్లో ఇలా వ్రాయబడి ఉంది,,,, యేసు క్రీస్తు మళ్ళి తిరిగి ఒస్తాడు!!!!! అని,,, దీనినే మన హిందూ మతంలో కలియుగ దేవుడు వస్తాడు అని నమ్ముతారు.
కురాన్లో సురాహ్హ్ అనే అధ్యాయం లో 43:61 వచనంలో – లోకం సమాప్తం అవడానికి ఇదే గురుతు అది ఏమిటంటే,,-- ఇదిగో యేసు ప్రభు ఆకాశం నుండి దిగివస్తాడు అదే సమయంలో ప్రతి ఒక్కరు న్యాయం తీర్చబడతారు, ఆ ఘడియ తప్పక వస్తుంది సందేహపడవద్దు!! అని వ్రాయబడి ఉంది.
ఆకరికి,, ముస్లింల కురాన్లో యేసు క్రేస్తూ పుట్టిన రెండవ రోజే మాట్లాడాడు అని,,, తన 5 వ ఏట ఒక పక్షి బొమ్మ చేసి దానికి ప్రాణం పోసాడు అని, చనిపొయిన వాళ్ళను తిరిగిలేపాడు అని, గుడ్డివాళ్ళను, కుష్టురోగం ఉన్నవాళ్ళని ముట్టి స్వస్థత మరియు రోగం నుండి విముక్తి ఇచ్చాడని కురాన్ చెపుతుంది. ఇంకా యేసు క్రేస్తూ గురించి ఒక అధ్యాయంమే ఉంది. యేసు ప్రభు పేరు కురాన్లో ఈశమసీహ అని ఉంటుంది.
కురాన్లో సురాహ్హ్ అనే అధ్యాయం లో ఈవచనాలు అన్ని యేసు క్రేస్తూ గురించి చెప్పినవే ఒక్కసారి అనుమానం ఉంటె చదవండి --
కురాన్ సురాహ్హ్, Surah Maryam, Surah 19, Ayah 16 to 40 , 19:34,19:33, 19:92, 21:91, 43:57, 43:61, 43:63,57:27 వచనాలు.
అవన్నీ ఇప్పుడు మీకు చెప్పడానికి నాకు సమయము లేదు .. కానీ ఒకటి మాత్రం నిజం ముస్లిం లు నమ్మే  మొహ్మద్ అనే ప్రవక్త గురించి కురాన్ లో ఇలా ఉంది , అందరు పుట్టేలాగే పుట్టి, 9 తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలని కని అందరిలాగే చనిపోయాడు, మళ్ళి తిరిగిరాడు అని ఉంది. కానీ అదే కురాన్ లో యేసు క్రేస్తూ గురించి ఇలా ఉంది -  ఒక పవిత్రమైన కన్య కు పుట్టాడు, చనిపోయిన వారిని లేపాడు, రోగులను స్వస్థపరిచాడు , పుట్టు గుడ్డివాళ్ళకి కన్నులు తెపించాడు, తన 5 వ సంవత్సరము లోనే చిన్నపిల్లవాడిగా ఉన్నపుడే మట్టితో పక్షుల బొమ్మలు చేసి ప్రాణం పోసాడు అని, కొన్నిరోజులకే  మాట్లాడాడు అని , తాను పెళ్లి చేసుకోలేదు, మనసులో కుడా తప్పుడు ఆలోచనల వలన పాపము చెయ్యలేదు  అని, చనిపోయే వరకు పవిత్రముగా ఉన్నాడు అని , అందరిలాగా చనిపోలేదు కానీ సిలువ వేసి చంపివేశారు అని , కానీ చనిపోయినాక త్రీ వ రోజు మళ్ళి తిరిగి బ్రతికాడు అని, ఆకారిగా  ఈ భూమి మీదకు  మళ్ళి తిరిగి వచ్చి ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చి మనుషులను ఈ భూమిపైనుండి తీసుకువెళ్తాడు అని ఉంది . దీనిని భట్టి ఆలోచించండి యేసు క్రీస్తు ఎవరు అని ?? యేసు క్రేస్తూ  మళ్ళి వస్తాడు అని ప్రతి ముస్లిం ,క్రిస్టియన్ ఎదురుచూస్తున్నారు, కల్కి భగవానుడు ఒస్తాడు అని హిందువులు ఎదురు చుస్తునారు, అతను ఎవరో కాదు యేసు ఏ!!!
కాభట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, కేవలము పాపలు చేసి బ్రతికే మన కోసం,,పరలోకంలో ఎంతో ఉన్నతమైన మహిమ గలదేవుడు, అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసా ? ఎంత అంటే,,పరలోకంలో శక్తివంతమైన, భయంకర మైన దేవదూతలు మరియు పంచభూతములు సైతం దేవుడి శక్తిని చూడలేక గజగజ ఒణుకుతూ, వాటిరెక్కలను వాటి మోహమునకు అడ్డుపెట్టుకుని దేవుడిని స్తుతిస్తూ ఉంటాయి అని వ్రాయబడి ఉంది  !!!!! అలంటి శక్తివంతమైన పరిశుద్ధమైన దేవుడు ,, తను అనుకుంటే ఒక్క క్షణములోఈసృష్టిని నాశనము చెయ్యగల దేవుడు,, ఒక పేదవాడిగా,పశువుల పాకలో పుట్టాడు, తలకు ముళ్ళకిరీటముపెట్టి, మోహము పైన ఉమ్మువేసినా భరించాడు, యేసుక్రీస్తు తనకాళ్ళు చేతులు రక్తం కారెల మేకులతో గుచ్చినా, తన పక్కలో భాలు సు తో పొడిచినా, కొరడాలతో వూడి వచ్చేలా కొట్టినా ,,దేవుడు వధించబడడానికి వచ్చిన గొర్రె పిల్లలాగ మౌనముగా ఉన్నాడు అని వ్రాయబడి ఉంది !!!!ఎందుకు????? మన వేదములలో కురాన్లో, బైబిల్ లో చెప్పిన శ్లోకములు మంత్రములు సూచనలు నేరవేరాలి అనే కదా ?ఇవన్నీ దేవుని శక్తి ముందుఎంత  ??? కేవలము నిన్ను నన్ను తను ప్రేమించాడు కాబట్టే ఇవన్ని ఒర్చుకున్నాడు కదా ??? కేవలము నువ్వు నేను చేసిన పాపాలు తొలగిపోయి తనతో పాటు మనము కుడా  పరలోకంలో ఉండాలనే కదా ??  ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ కేవలము బైబిలు నుండి తీసుకున్నప్రవచనాలు కాదు,మన పురాణ వేదాలు, ముస్లింల కురాన్లో యేసుక్రీస్తు గురించి చెప్పినవి !!!అందరు ఎదురు చూసేది యేసుక్రేస్తూ కొరకే. ఇప్పటికయినా త్వరగా బైబిల్, కురాన్, హిందూ వేదాలు చెపుతున్ననిజమైన దేవుడిని తెలుసుకుని బాప్తీస్మముపొందండి. కొందరు దెవుడిని నమ్మని నాస్తికులు దేవుడు లేనే లేడు అంటారు సరే లేకపోతే  పరవాలేదు, కానీ నువ్వు చచ్చిపోయిన తరువాత ఒకవేళ దేవుడు  ఉంటె  ? స్వర్గం నరకం నిజముగా ఉంటె ? నీ పరిస్థితి ఏమిటి ?మళ్ళి నీకు ప్రాణం వస్తుందా ? ఒక్కసారి ఆలోచించు ?ఇక సమయము లేదు ఎందుకంటే ఈ ప్రపంచం ముగిసిపోడానికి దేవుడే రానక్కరలేదు నీ చావువచ్చినా అది దేవుడు వచ్చినదానితో సమానమే కదా?? దేవుడిని నువ్వుచూసినా దేవుడు నిన్ను చూసినా ఒక్కటె కదా ??గుర్తు ఉంచుకో బాప్తీస్మము తీసుకుంటేనే దేవుడు చిందించిన రక్తము నీకు వర్తిస్తుంది లేకపోతే నీ పాపాల ప్రకారము నువ్వు నరకానికే వెళ్ళాలి.

దేవుడు వచ్చే ముందు ఆఖరి రోజులలో యేసు క్రీస్తు గురించిన ఈ నిజాలు ఈ భూలోకం లో ప్రతిఒక్కరికి తెలుస్తుంది అని బైబిల్ లో ఉంది, ఇది చదువుతున్న నీకు ఇప్పడు ఈ పేపర్ ద్వారా  తెలిసింది, నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజాము మిత్రమా. ఆ తరువాత నీ నిర్ణయము నీ ఇష్టము!!!!!!!..ఈ వాక్యములు చదువుతున్న ప్రతి వానికి యేసుక్రీస్తు నామమున రక్షణ కలుగును గాక ఆమెన్ !!
ప్రకటనగ్రంధం 1:17, 18 నేను మొదటి వాడను ఆకరివాడను జీవించు వాడను, మ్రుతుడను అయ్యాను కాని ఇదిగో యుగయుగములు సజీవుడనైఉ న్నాను. మరియు మరణము యొక్క పాతాళము యొక్కతాళపుచెవులు నా స్వాధీనములోఉన్నవి. (అని యేసు చెప్పాడు)
కురాన్ లో ఇలా వ్రాసి ఉంది – యేసు క్రీస్తు తెల్లని వస్త్రాలతో ఆకాశమునుండి దిగి ఒస్తాడు, తన చేతులు ఇదరు దూతల రెక్కలపైన మోపి ఒస్తాడు. అతను వచ్చినపుడు తన కంటికి ఎవ్వరైతే బక్తిహీనుల లాగా కనిపిస్తారో, బాప్తేస్మము తీసుకుని దేవుడిని నమ్మని వారు, వాళ్ళందరూ శాశ్వతముగా చనిపోతారు
కురాన్లో సురాహ్హ్ అనే అధ్యాయంలో 43:61 వచనంలో – లోకం సమాప్తం అవడానికి ఇదే గురుతు ,,ఇదిగో యేసుప్రభు ఆకాశం నుండి దిగివస్తాడు అదే సమయంలో ప్రతిఒక్కరు న్యాయం తీర్చబడతారు, ఆఘడియ తప్పక వస్తుంది సందేహపడవద్దు.
భగవత్గీత 2.7.38- ప్రపంచం అంతా అన్యాయంతో నిండినపుడు ఆఖరికి పూజారులు కూడా దేవుడిని మరిచినపుడు, పాపము ప్రపంచం అంతా వ్యాపించినపుడు అప్పుడు దేవుడు ఆకాశంలో నుండి దిగివస్తాడు.
ఆకారిగా యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పడానికి ఈ క్రింద ఆయన స్వయముగా చెప్పిన మాటలు చదవండి. అది చదివిన తరువాతైనా నమ్మండి.
ప్రకటన గ్రంథము (2:8)
మొదటివాడును కడపటివాడునైయుండి, మృతుడై మరల బ్రదికినవాడు (ఏసు క్రీస్తు) చెప్పుసంగతులేవనగా ,
(22:12-13)
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది.
 నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునైయున్నాను. (1.6-8) వర్తమాన భూతభవిష్యత్కాలములలోఉండువాడను నేనే! అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
యోహాను సువార్త 1.1-2
ఆదినుండి ఏదియుండెనో, మేమేదివింటిమో, కన్నులార ఏదిచూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకిచూచెనో, అది మీకు తెలియ జేయుచున్నాము.
జీవము భూమిపై ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్యజీవమును మేము చూచి, జీవమునుగూర్చిసాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియపరచుచున్నాము.
1 యోహాను సువార్త 1-5
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. వాక్యము శరీర రూపము దాల్చి, కృపా సత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను,
 కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
ఆయనలో జీవముండెను; జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని, లోకము ఆయనను తెలిసికొనలేదు !
కొలొస్సయులకు అధ్యాయం 1:15-16
ఆయన( యేసు క్రీస్తు) అదృశ్య దేవుని స్వరూపియై సర్వ సృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.
 ఏలయనగా ఆకాశమందున్నవియు, భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును, ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను.
ఫిలిప్పీయులకు 2:6-11
 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదుగాని,
మనుష్యుల పోలికగాపుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్నుతానే రిక్తునిగా చేసికొనెను.
మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయతచూపినవాడై, తన్నుతానుతగ్గించుకొనెను.
అందుచేతను పరలోకమందున్నవారిలోగాని, భూమిమీదఉన్నవారిలోగాని,
భూమిక్రిందఉన్నవారిలోగాని, ప్రతివానిమోకాలును యేసు నామమున వంగునట్లును,
ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
యోహాను సువార్త 8:58
అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతోనిశ్చయముగా చెప్పుచున్నాననెను అని ఏసు క్రీస్తు వారితో చెప్పెను.
మత్తయి 1:23
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరుపెట్టుదురు.
ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
యెషయా 43.10-11
నాకు ముందుగా దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత దేవుడునుండడు.
నేను నేనే యెహోవాను, నేను తప్పవేరొక రక్షకుడు లేడు.
యోహాను సువార్త  1.11-12
ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
ఆయనను  ఎందరు నమ్మి అంగీకరించెదరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
యోహాను సువార్త 14.8-14
 ఫిలిప్పు అనబడే దేవుని శిష్యుడుప్రభువా, తండ్రిని (దేవుడిని) మాకు కనబరచుము, మాకు అది చాలు అని ఆయనతో చెప్పగా,
యేసు ఇలా అనెను - ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా?? నన్నుచూచినవాడు తండ్రిని(దేవుడినిచూచియున్నాడు గనుక తండ్రిని(దేవుడిని
మాకు కనుపరచుమని యేల అడుగుచున్నావు?
తండ్రి యందు నేను నాయందు తండ్రియు ఉన్నామని నీవునమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందునివసించుచు తన క్రియలు చేయుచున్నాడు.
తండ్రి యందు నేను నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.

నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని ఏసు క్రీస్తు వారితో చెప్పెను
యోహాను సువార్త 8.24
నేనే ఆయనను అని మీరువిశ్వసించనియెడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురని ఏసు క్రీస్తు చెప్పెను.
యోహాను సువార్త 10.30
ఏసు క్రీస్తు  - నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితోచెప్పెను (అనగా ఇద్దరూ ఒక్కరే అని అర్ధము)
దేవుడు ఆత్మ, శక్తి రూపము అని  బైబిల్ లో వ్రాయబడి ఉంది. ఆయననే మనముతండ్రిఅంటాము. ఎందుకంటే మన ఆత్మలకు తండ్రి ఆయనే. ఆయన పేరేయెహోవా”  అని వ్రాయబడి ఉంది!! కానీ ఆయన మనకోసము శరీర రూపము దాల్చి మనిషిగా వచ్చిన  తరువాత ఆయనే "కుమారుడు" అని వ్రాయబడి ఉంది. ఆయననే  ఏసు క్రీస్తు అని అనుచున్నాము ! ఏసు క్రీస్తు అనగా భాషాంతరమున రక్షకుడు అని అర్ధము !
అపొస్తలుల కార్యములు 4:12
 మరి ఎవనివలనను రక్షణ  కలుగదు; నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి నామమున రక్షణ పొందలేము.
అపొస్తలుల కార్యములు 20:28
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము(జనము).
1 తిమోతికి 3:16
ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను అని వ్రాయబడి ఉంది
రోమీయులకు 5:8
అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మన కొరకుచనిపోయెను.
ప్రకటన గ్రంథము 1.7
ఇదిగో ఆయన మేఘములపై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును ఆయనను చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ముకొట్టుకొందురు; అవును ఆమేన్!!!!
తెలిసీ తలియక ఏమైనా తప్పులు అచ్చుతప్పులు రాసి ఉంటె యేసు నామమున నాకు క్షమాపణ కలుగునుగాక ఆమెన్.ఇట్లు మీ జాషువా డేనియల్.


Comments

Popular posts from this blog